- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Eluruలో ఉద్రిక్తత.. మాజీ ఎమ్మెల్యే చింతమనేని అరెస్ట్
ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఆస్పత్రిలో నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న కాపు నేత చేగొండి హరిరామ జోగయ్యను పరామర్శించేందుకు టీడీపీకి చెందిన చింతమనేని ప్రభాకర్తోపాటు పలువురు టీడీపీ నేతలు ఆస్పత్రికి చేరుకున్నారు..

X
దిశ, ఏలూరు: ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఆస్పత్రిలో నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న కాపు నేత చేగొండి హరిరామ జోగయ్యను పరామర్శించేందుకు టీడీపీకి చెందిన చింతమనేని ప్రభాకర్తోపాటు పలువురు టీడీపీ నేతలు ఆస్పత్రికి చేరుకున్నారు. అయితే లోపలికి అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, టీడీపీ నేతలకు మధ్య వాగ్వాదం జరిగింది. మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కాలర్ పట్టుకుని పోలీసులు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించారని ఆయన అనుచరులు ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో మాజీఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్తోపాటు పలువురు టీడీపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.
Also Read...
Next Story






